ఈటల, అరవింద్ కు భద్రత..విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

-

ఈటల రాజేందర్‌, బీజేపీ ఎంపీ ధర్మపూరి అరవింద్ కు భద్రత పెంచడంపై..విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల భద్రతపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఇంటలిజెన్స్ సమాచారం అనుసరించి తీసుకుంటున్న జాగ్రత్తలు ఎంతైనా అభినందనీయం అన్నారు రాములమ్మ.

అయితే ఎమ్మెల్యే రాజ్ సింగ్ గారి భద్రత అంశంలో రాష్ట్ర ఇంటిలిజెన్స్, సరైన సమాచారం ఇయ్యక, కొంత భద్రతా లోపం ఏర్పడుతున్నట్లు ప్రజలు అభిప్రాయపడుతున్నారని వెల్లడించారు. ఆ అంశం కూడా సమస్య తీవ్రత దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఇంటలిజెన్స్ కేంద్రానికి సరైన నివేదిక సత్వరం ఇస్తుందని అభిప్రాయపడుతున్నానని చెప్పుకొచ్చారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news