రెండు జాతీయ పార్టీలను కట్టగట్టి కాలేశ్వరం ప్రాజెక్టులోకి విసిరేస్తాం – ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

-

ఆర్మూర్ మండల కేంద్రంలో 57 ఏళ్లు నిండిన వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు కొత్తగా ప్రభుత్వం మంజూరు చేసిన ఆసరా పెన్షన్లను అందజేశారు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు జాతీయ పార్టీలను కట్టగట్టి కాలేశ్వరం ప్రాజెక్టులోకి విసిరేస్తామన్నారు. అద్భుతమైన ఆలోచన విధానంతో, దురదృష్టితో ఆదర్శ పాలన సాగిస్తూ పెరిగిన సంపదను ప్రజలకు పంచే కెసిఆర్ కావాలా? దేశ ప్రజల నోటికాడ కూడును ఆదానీ, అంబానీలకు పంచుతూ దేశాన్ని ముంచుతున్న మోడీ కావాలో ప్రజలు తేల్చుకోవాలని అన్నారు.

బిజెపి ఒక విచ్ఛిన్నకర, విద్వేషకరదృష్ట శక్తి అని మండిపడ్డారు జీవన్ రెడ్డి. తెలంగాణ గడ్డమీద కాంగ్రెస్, బిజెపి పార్టీలకు స్థానం లేదన్నారు. కులం పేరుతో, మతం పేరుతో ప్రజలను హింస పెడుతున్న ఈ రెండు జాతీయ పార్టీలను తరిమికొడదామని పిలుపునిచ్చారు. కెసిఆర్ లాంటి దార్శనీకత ఉన్న సీఎం దేశంలో ఎవరూ లేరు అని అన్నారు. కెసిఆర్ దయతో ఆర్మూరును అభివృద్ధికి రోల్ మోడల్ చేశానన్నారు జీవన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news