అవినీతి ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎందుకు కాపాడుతున్నారు – జీవన్ రెడ్డి

-

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ పథకాన్ని అత్యంత అవినీతిమయంగా మార్చారని ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. తప్పు చేసిన వారిని శిక్షించడానికి ఆయన ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.

కెసిఆర్ దళిత జాతిని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజయ్య పై ఆరోపణలు వస్తే ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిన కేసీఆర్.. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యేల తాట తీయడానికి కేసీఆర్ కి భయం ఎందుకు అన్నారు జీవన్ రెడ్డి. దళిత బంధు అవినీతికి సీఎం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news