మందుబాబులకు అలర్ట్..ఇవాళ సాయంత్రం నుంచే వైన్ షాపుల మూసివేత

-

Hyderabad: మందు బాబులకు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్‌ లో మద్యం షాపులు బంద్ కానున్నాయి. హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో ఇవాళ సాయంత్రం మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు సబరాబాద్ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులో మూసివేయాలని సైబరాబాద్ పోలీసులు కీలక ఆదేశాలు ఇచ్చారు.

ఎవరైనా మద్యం సేవించి గొడవలు సృష్టించినా… రహదారులపై గుంపులుగా తిరిగిన కేసులు పెడతామని సైబరాబాద్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అలాగే హైదరాబాద్‌ నగరంలో తిరిగే వాహనాలపై కానీ… ఇతర జనాలపై రంగులు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. రూల్స్ బ్రేక్ చేసిన వారిని అరెస్టు కూడా చేస్తామని పేర్కొన్నారు సైబరాబాద్ పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Latest news