నా రాజీనామాతోనే ఫామ్ హౌస్ లో ఉన్న సీఎం మునుగోడు వచ్చారు – రాజగోపాల్ రెడ్డి

-

తన రాజీనామా తోనే ఫామ్ హౌస్ లో ఉన్న సీఎం కేసీఆర్ మునుగోడు వచ్చారని అన్నారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు లో బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. గత నెల రోజుల నుండి ఏ టీవీ పెట్టినా మునుగోడు గురించి చర్చ జరుగుతోందని అన్నారు. తన రాజీనామా తోనే మునుగోడులో రోడ్లు, కొత్త పెన్షన్లు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు.

తాను ఎమ్మెల్యేగా ఉండి ఏమీ చేయలేకపోయానని.. కానీ తన రాజీనామాతో ఇవన్నీ జరగడం సంతోషంగా ఉందన్నారు. కుటుంబ పాలనను అంతమొందించడానికి రాజీనామా చేశానని వ్యాఖ్యానించారు. మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచిపోయే తీర్పును ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలిస్తే.. ప్రతి ఒక్కరూ రాజగోపాల్ రెడ్డిలే అవుతారని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news