వైసీపీ పై యామిని శర్మ సంచలన వ్యాఖ్యలు

-

ఆడలేక మద్దెల దరువు అన్న విధంగా వైసీపీ పరిస్థితి ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ విమర్శించారు. జగన్ చేసే మద్యం విక్రయాలను బీజేపీ అధ్యక్షురాలు ఆధారాలతో చూపిస్తే.. తట్టుకోలేక పోయారని ఆమె ఆరోపించారు. ఆర్థిక అవినీతి, అప్పుల పాలవుతున్న వైనం పురంధేశ్వరి వివరించారని యామిని శర్మచెప్పుకొచ్చారు. ఓ మహిళ అనే ఇంగితం కూడా లేకుండా మాట్లాడిస్తారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు.

యామిని శర్మ మాట్లాడుతూ. అధికారం వస్తే.. మంచి పాలన అందించకుండా ప్రతిపక్షాల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ప్రజలకు మంచి పాలన ఇస్తారనే కదా వైసీపీకి అధికారం ఇచ్చారు. వైసీపీ నాయకులు ఇంత నీచంగా దిగజారి మాట్లాడుతారా..? మద్యం ఇసుక దందాలను నిలదీస్తే విమర్శలు చేయిస్తారా ? వైసీపీ లాంటోళ్లకు తగిన బుద్ధి చెప్పే ధైర్యం, దమ్ము బీజేపీకి ఉన్నాయి. అన్ని వర్గాల వారు జగన్ పాలన ఎప్పుడూ పోతుందా అని ఎదురుచూస్తున్నారు. జగన్ ప్రభుత్వం అసమర్థ పాలన చేస్తున్నారు. ప్రజలకు మంచి పాలన చేయండి. లేదంటే ప్రజలే మీకు బుద్ధి చెబుతారని యామిని శర్మ వ్యాఖ్యానించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news