దారుణం.. బస్టాండ్‌లో నిద్రపోతున్న యువతిపై అత్యాచారం

-

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బస్టాండ్‌లో నిద్రపోతున్న యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటన చోటుచేసుకుంది. బస్టాండ్‌కు వచ్చిన వ్యక్తులు యువతి వివస్త్రగా ఉండడాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. బస్టాండ్​కు చేరుకున్న పోలీసులు యువతిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితులను ట్రేస్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన యువతి(20)కి నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన వారం రోజులకే భర్తతో విభేదాలు రావడంతో పుట్టింటికి వచ్చేసింది ఆ యువతి. అయితే ఆదివారం రోజున పుట్టింట్లో తల్లిదండ్రులతో గొడవ పడింది. దీంతో అక్కడ ఉండలేక.. చేవెళ్లలోని తన సోదరి ఇంటికి బయల్దేరింది.

సోదరి ఇంట్లో లేకపోవడంతో తిరిగి ఎక్కడికెళ్లాలో ఆమెకు అర్థం కాక.. కల్లుతాగి చేవెళ్ల బస్టాండ్‌కు వచ్చింది. ఆ సమయంలో ఊరికి బస్సు లేకపోవడం, అప్పటికే మత్తులో ఉండటంతో ఆమెను నిద్రమత్తు కమ్మేసింది. దీంతో ఆమె బస్టాండ్‌లోనే నిద్రపోయింది. అటుగా వచ్చిన ఇద్దరు యువకులు.. యువతి ఒంటరిగా ఉండడం .. ఆపై నిద్రలో ఉండటం గమనించారు. రాత్రి 10 గంటల తర్వాత అక్కడ ఎవరూ లేకపోవడాన్ని అవకాశంగా తీసుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కాసేపటి తర్వాత బస్టాండ్​కు వచ్చిన ప్రయాణికులు యువతి వివస్త్రగా ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువతిని ఆస్పత్రికి తరలించి.. సీసీటీవీ ఫుటేజీ సాయంతో నిందితులు.. చేవెళ్లకు చెందిన అనిల్‌కుమార్‌, రాజులుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news