పార్టీ మారిన వ్యభిచారం చేసినట్లే – వైఎస్‌ షర్మిల ఘాటు వ్యాఖ్యలు

-

మాటిస్తే మడమ తిప్పని వైయస్సార్ బిడ్డగా చెప్తున్నా….తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం తెస్తానని వైఎస్సార్ తెలంగాణ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సంచలన ప్రకటన చేశారు. బంగారు తెలంగాణ కాదిది….బాధల తెలంగాణ అని.. బార్లు – బీర్లు – ఆత్మహత్యల తెలంగాణగా మారిందని సీఎం కేసీఆర్‌ ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు షర్మిల.

ఉద్యమం చేసిండని కేసిఆర్ ను రెండు సార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఈ ప్రజలకు ఆయన చేసిందేమిటని నిలదీశారు. ఎన్నికలప్పుడు గారడి మాటలు తప్ప కేసిఆర్ తెలంగాణ ను ఉద్దరించేది ఏమిటని ప్రశ్నించారు వైఎస్‌ షర్మిల. మళ్ళీ కేసిఆర్ మాటలకు మోసపోవద్దు.. ప్రజలేసిన ఓట్లతో గెలిచి అధికారపార్టీకి పోయిన ఎమ్మెల్యేలను ఏమనలి… ఇది రాజకీయ వ్యభిచారం కాదా… అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రభుత్వానికి ప్రశ్బించే ప్రతిపక్షాలున్నాయా….అని ప్రశ్నించారు. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ జెండా ఎగుర వేస్తామని చెప్పారు.  కాకరవాయి సభలో షర్మిల ఈ హాట్‌ కామెంట్స్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news