అనంతపురం క్లాక్ టవర్ వద్ద ఉద్రిక్తత

-

అనంతపురం క్లాక్ టవర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసిపి – టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణలతో ఉద్రిక్తత నెలకొంది. రాప్తాడు అభివృద్ధిపై ఇక్కడికి వచ్చి మాట్లాడాలని టిడిపి సోషల్ మీడియాలో సవాల్ చేయగా.. వైసీపీ కార్యకర్త రామకృష్ణారెడ్డి అక్కడికి వెళ్లారు. టిడిపి ఆఫీస్ వద్దకు వెళ్లి సెల్ఫీ వీడియోలో పలు ఆరోపణలు చేశారు.

ఆ తర్వాత అనంతపురం క్లాక్ టవర్ వద్దకు రాగా.. టిడిపి కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ చెలరేగింది. వైసిపి – టిడిపి వర్గీయులు ఘర్షణకు దిగారు. ఈ రాళ్ల దాడిలో కానిస్టేబుల్ తో పాటు మరొకరికి గాయాలు అయ్యాయి. పోలీసు వలయాన్ని చేదించుకొని క్లాక్ టవర్ వద్దకు చేరుకున్నారు గుంటూరుకు చెందిన వైసిపి సోషల్ మీడియా మద్దతు దారుడు. దీంతో అతన్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news