నెల్లూరులో ఏలూరు తరహాలో 10 మందికి అస్వస్థత.. ఒకరు మృతి !

-

నెల్లూరు జిల్లా కలువాయి మం వెరుబోట్ల పల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ ఊరిలో వరి నాట్లు వేయడానికి 70 మంది వలస కూలీలు పశ్చమ బెంగాల్ నుండి‌ వచ్చారు. ఓ రైతు పొలంలో వరినాట్లు  వేస్తుండగా అందులో 10 మంది అస్వస్ధకు గురయ్యారు. ఆస్వస్థతకు గురైన వారిలో ముండా అనే కూలీ మృతి చెందారు. వారిలో 3 పరిస్ధితి విషమంగా ఉండడంతో నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు..

ఒక ఆరుగురు కూలీలు మాత్రం పొదలకూరు ప్రభుత్వ వైద్యశాలలో చికత్స పొందుతున్నారు. ఇక మరో మహిళకు చాలా సీరియస్ గా ఉన్నట్టు చెబుతున్నారు. ఇటీవల ఏలూరులో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. వారిని‌ పరీక్షించిన వైద్యులు ఫుడ్ పాయిజన్ అయిందని తెలిపారు. దీంతో వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news