వాలంటీర్ ఉద్యోగాలకు నేడే ఏపీలో పరిక్షలు, ఎంత మంది అంటే…!

-

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు నేటినుంచి రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,162 గ్రామ సచివాలయాల, 3786 వార్డు సచివాలయాల పోస్ట్ ల కోసం పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది 1,26,728 ఉద్యోగాలకు రాత పరీక్షలు నిర్వహించి 1,10,520 పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం… ఇప్పుడు మిగిలిన పోస్ట్ ల మీద దృష్టి పెట్టింది.

మిగిలిన 16,208 పోస్టుల కు నేటి నుండి రాత పరీక్షలు షురూ చేసారు. గ్రామ సచివాలయ పోస్టులు 14062 కాగా, వార్డు సచివాలయ పోస్టులు 2146 ఉన్నాయి. ఈ పోస్టులకు 10.56 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 14 రకాల పోస్టుల కోసం నేటి నుంచి 26వ తేదీ వరకూ రెండు పూటలా పరీక్షలు నిర్వహిస్తామని, నిబంధనలు విడుదల చేసామని అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news