TGSRTC ఫేక్ లోగో..పోలీస్ స్టేషన్ లో ఇద్దరిపై కేసు నమోదు

-

టీజీఎస్ఆర్టీసీ ఫేక్ లోగో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.ఈ ఘటనపై కొణతం దిలీప్ , హరీశ్ రెడ్డిపై ఐపీసీ తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. నిందితులు TGSRTCకి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా పోస్టులు పెడ్తున్నారు అని ఆర్టీసీ అధికారులు అన్నారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. టీజీఎస్ ఆర్టీసీ కొత్త లోగో విషయంలో నెట్టింట్లా జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్(ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.

ఇప్పటివరకు అధికారికంగా కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదని వెల్లడించారు. టీజీఎస్‌ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్‌ అనిఆయన వెల్లడించారు. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని సజ్జానర్ తెలిపారు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోందని తెలిపారు. కొత్త లోగోను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news