అందుకే.. కేసీఆర్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి పంపుతున్నారు.. బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్

-

తెలంగాణ రాజకీయంలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై మాటల తుటాలు పేలుతున్నాయి.ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం శంషాబాద్‌లోని టీ బీజేపీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో బండి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అధికార కాంగ్రెస్ పార్టీలోకి పంపించేది కేసీఆరేనని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వెనక కేసీఆరే ఉన్నారని.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి కేసుల నుండి బయటపడేందుకు కేసీఆర్ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి పంపుతున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు బండి సంజయ్. ఇక, కాంగ్రెస్ తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిందని , సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల ద్వారా నిరుద్యోగులను అణిచివేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేయండతో ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని అన్నారు. తెలంగాణలో ప్రజలకు బీజేపీపై విశ్వాసం పెరిగిందని, అసలు గ్యారంటీ మోడీదేనంటూ ప్రజలకు బలంగా నమ్ముతున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news