ఏపీ పోలీసులు అరుదైన రికార్డ్… ఒక్కసారే 5 అవార్డ్ లు

-

ఏపీ పోలీసులు మరోసారి సత్తా చాటారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఆంధ్ర పోలీస్ శాఖ సత్తా చాటింది. జాతీయస్థాయిలో పోలీస్ శాఖలో టెక్నాలజీ వినియోగం పై నిన్న స్కోచ్ గ్రూప్ ప్రకటించిన 18 అవార్డులలో ఐదు అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ సొంతం చేసుకుంది. ఒక్కసారే 5 అవార్డులు వచ్చిన ఏకైక రాష్ట్రంగా నిలిచింది. తాజాగా స్కోచ్ గ్రూప్ ప్రకటించిన అవార్డులలో ఐదు గెలుచుకోగా అందులో ప్రాజెక్ట్ టాటా, సైబర్ మిత్ర(మహిళ భద్రత) రజత పతకాలు కైవసం చేసుకుంది.

జాతీయ స్థాయిలో భారీగా అవార్డులను కైవసం చేసుకోవడం ఏపీ పోలీసులకు నెల వ్యవధిలో ఇది మూడోసారి అని ఏపీ పోలీస్ వర్గాలు పేర్కొన్నారు. సైబర్ మిత్ర తో పాటు అఫెండర్ సెర్చ్, ఉమెన్ సేఫ్టీ (విజయనగరం జిల్లా), సువిధ(అనంతపురం), ప్రాజెక్ట్ టాటా (ప్రకాశం జిల్లా)విభాగాల్లో ఐదు స్కోచ్ అవార్డులు వచ్చాయి. కేవలం 11నెలల కాల వ్యవధిలో 108 జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు సాధించిన అవార్డులలో రెండు బంగారు, 13 రజిత పతకాలను ఏపీ పోలీసులు సాధించారు.

Read more RELATED
Recommended to you

Latest news