దేశంలోనే తొలిసారి.. ఏపీ ప్రజలక్జ్ గుడ్ న్యూస్..?

-

ఇటీవల ఏపీ ప్రజలందరికీ శుభవార్త తెలిపింది ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ. కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు తమ సమస్యలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో… ఇటీవల ఓ వినూత్న ఆలోచన చేసి ఏపీ పోలీస్ సేవ అనే సరికొత్త యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా దీనికి సంబంధించిన యాప్ ను ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.

అయితే ఈ యాప్ లో భాగంగా అన్ని రకాల నేరాలకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది అంటూ పోలీస్ శాఖ అధికారులు తెలిపారు. మొత్తంగా ఈ యాప్ లో ఏకంగా 87 రకాల సేవలు ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయని పోలీసు అధికారులు తెలిపారు. అయితే రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ లకు ఈ యాప్ ను అనుసంధానం చేస్తామంటూ పోలీస్ అధికారులు తెలిపారు. ప్రజలందరూ ఈ యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సద్వినియోగం చేసుకోవాలి అంటూ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news