దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైమ్.. భారీ నగదు రికవరీ చేసిన సైబరాబాద్ పోలీసులు

-

సాధారణంగా సైబర్ నేరాళ్లో బాధితులు కోల్పోయిన నగదు రికవరీ చేయడం అనేది దాదాపుగా అసాధ్యం. కానీ సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మార్కెట్‌ బాక్స్‌ యాప్‌ ద్వారా పెట్టుబడులు, ట్రేడింగ్‌ పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న రాజస్థాన్, యూపీకి చెందిన ముఠా నుంచి రూ.9.81 లక్షలు రికవరీ చేశారు. ఇప్పటి వరకు సైబర్ నేరాల్లో రికవరీ చేసిన నగదులో ఇదే భారీ మొత్తమని పోలీసుుల చెబుతున్నారు. 10 మంది గల ఈ ముఠాలో ఇప్పటి వరకు నలుగురిని కటకటాల్లోకి నెట్టారు.


మార్కెట్‌ బాక్స్‌ అనే ట్రేడింగ్‌ నకిలీ యాప్‌ను రూపొందించి.. సామాజిక మాధ్యమాల వేదికగా దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సెబీలోనూ రిజిస్టర్ కాని ఈ యాప్‌లో 3 వేల మంది వరకు నమోదు చేసుకుని.. లావాదేవీలు జరిపినట్లు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. అమాయకుల నుంచి ఈ ముఠా రూ.10 కోట్ల వరకు ఆన్‌లైన్‌ వేదికగా వసూలు చేసి మోసాలకు పాల్పడినట్లు చెప్పారు. గత ఏడాది ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ ప్రారంభించగా.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news