కడియంపై చర్యలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ అధిష్టానం

-

ఊహించినట్టే బీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు కూతురు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరారు. అలాగే తాను వరంగల్ బరి నుంచి తప్పుకొంటున్నట్లు కడియం కావ్య కేసీఆర్కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. తనను మన్నించాలంటూ ఆమె అందులో కోరారు. ఇక తన కూతురు భవిష్యత్తు కొరకై బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ అధిష్ఠానం సీరియస్ ఉంది.

ఈమేరకు ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యే కడియంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు పిటిషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. ఇప్పటికే పలువురు నేతలు స్పీకర్ను కలిసేందుకు అసెంబ్లీకి వెళ్లారు. కడియం శ్రీహరి తన కూతురు కావ్యతో పాటు ఈరోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. కాగా, తాను కాంగ్రెస్లోకి వెళ్లేందుకు కార్యకర్తలు ఏకగ్రీవంగా ఓకే చెప్పారని బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news