చావులోనూ మృత్యువు ఆ ప్రేమికులను విడదీయ లేకపోయింది..!

-

ఒకరిని ఒకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు… పెళ్లితో ఒక్కటవ్వాలి అనుకున్నారు… చివరికి పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలి అని వెళ్తున్న ప్రేమ జంటను విధి చూసి ఓర్వ లేక పోయింది. ఒక్కటవ్వాలి అనుకున్న జంటను చావులో ఒకటి చేసి తీసుకు వెళ్ళిపోయింది మృత్యువు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రేమికులు మరణించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది .

యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్ ప్రాంతంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వెళుతున్న కారు బ్రేకులు ఫెయిల్ కావడంతో ముందుగా ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలోనే స్కూటీపై వెళుతున్న యువకుడు యువతి కింద పడిపోయారు. ఇక ఈ ప్రమాదంలో స్కూటీ అక్కడే దహనం కాగా ఇద్దరు ప్రేమికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే రంగారెడ్డి జిల్లా మన్నెగూడ కు చెందిన ఇద్దరు ప్రేమ వివాహం చేసుకోడానికి వెళ్తున్న సమయంలో ఈ విషాదకర ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news