బ్రిటన్‌లో కరోనా సెకండ్ వేవ్..4లక్షలకు పైగా యాక్టీవ్‌ కేసులు…!

-

బ్రిటన్‌లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా బ్రిటన్‌ వ్యాప్తంగా ఆసుపత్రుల్లో చేరే వాళ్ల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఇప్పటికే అక్కడ ఉన్న యాక్టివ్‌ కేసులతో ఆసుపత్రులు నిండిపోయాయి. గత మార్చి లాంటి పరిస్థితులు పునరావృత్తమౌతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. బ్రిటన్‌లో ఇంత వరకూ 6 లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. దాదాపు 43 వేల మంది చనిపోయారు. కోలుకున్న వాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది.

యూరప్‌ ఖండంలోనే కరోనా ప్రభావం అత్యధికంగా బ్రిటన్‌పై పడింది. ప్రస్తుతం అక్కడ 4 లక్షలకు పైగా యాక్టీవ్‌ కేసులున్నాయి. గత వారం లక్షా 16 మందికి కరోనా సోకింది.రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితుల వల్ల కరోనా తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీంతో వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కోసం కఠిన నిబంధనలను అమలు చేయాలని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భావిస్తున్నారు. దీనిపై అక్కడి పార్లమెంట్‌లో ఓ విధాన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. 3-టైర్‌ విధానంలో ఆంక్షలను విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news