ధోని మొదటి సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్ వైరల్..!

-

ప్రపంచ క్రికెట్ చరిత్రలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెప్టెన్ గా భారత్ కు మూడు ఐసీసీ టైటిల్స్ అందించి కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికినప్పటికీ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును సక్సెస్ఫుల్గా నడిపిస్తూ క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాడు. అంతేకాదు పలు వ్యాపారాలు కూడా చేస్తూ మంచి లాభార్జన పొందుతున్న ఈయన ధోని ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ ని కూడా స్థాపించారు. తాజాగా తన బ్యానర్ నుంచి ఒక కొత్త సినిమాని ప్రకటించారు.

“లేటెస్ట్ గెట్ మ్యారీడ్” అంటూ ఒక గ్లింప్ ను రిలీజ్ చేయగా.. చాలా ఎగ్జైట్ గా ఫీల్ అవుతున్నట్లుగా కూడా పేర్కొన్నారు ధోని. ఇందులో జెర్సీ ఫేమ్ హరీష్ కళ్యాణ్ ఇవానా, సీనియర్ నటి నదియా, ప్రముఖ తమిళ హాస్యనటుడు యోగిబాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రమేష్ తమిళమని దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు ,తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కానున్నట్లు సమాచారం.

ఈ ప్రొడక్షన్ హౌస్ కి ఆయన భార్య సాక్షి సింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది. అంతేకాదు తమ బ్యానర్ పై తెరకెక్కుతున్న మొదటి సినిమాకు ఆమె కథా సహకారం కూడా అందించినట్లు సమాచారం. ఈ మూవీ తర్వాత సౌత్ ఇండియాలో వరుస చిత్రాలను ప్లాన్ చేస్తున్నట్లుగా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు రమేష్ మాట్లాడుతూ..” నేను సాక్షి రాసిన కథను చదివినప్పుడు చాలా స్పెషల్ గా అనిపించింది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తాము” అంటూ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news