మా నాన్న రెండో పెళ్లి ఆపండి అంటూ పోలీసులను ఫిర్యాదు చేసిన చిన్నారి.. ఎక్కడంటే?

-

మనిషి జీవితం లో పెళ్లి అనేది ఒకసారి ఒకరితో మాత్రమే జరుగుతుంది..పెళ్లి ఎవరితో జరుగుతుందో స్వర్గంలో ముందే రాస్తారు అనేది ఒకప్పటి మాట.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. నచ్చితే కాపురం చేస్తారు.. లేకుంటే విడిపోతారు.. ఆ విషయంలో ఆడా, మగ ఇద్దరు తగ్గట్లేదు.. పిల్లలు న్నా కూడా రెండో పెళ్లి చేసుకుంటున్నారు.. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూసాయి.. అయితే ఇప్పుడు మనం చెప్పుకొనే ఘటన మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది..

ఓ వ్యక్తి భార్య చనిపోయిందని ఐదుగురు పిల్లల భవిష్యత్తును గాలికి వదిలేసి తన శారీరక సుఖం కోసం రెండో పెళ్లికి సిద్ధమాయ్యాడు.. ఆ విషయం తెలుసుకున్న తన కూతురు పోలీసులను ఆశ్రయించింది.. మా నాన్న రెండో పెళ్లిని ఆపండి అంటూ పోలీసులును వేడుకుంది..ఆ చిన్నారి భాధను చూసి అక్కడ ఉన్నవాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు.. ఇక వివరాల్లోకి వెళితే.. ఈ అమానుష ఘటన బీహార్ లో చోటు చేసుకుంది..

బీహార్ షియోహార్ లో వెలుగులోకి వచ్చింది..మనోజ్ అనే వ్యక్తి భార్య రెండేళ్ల కిందట అనారోగ్యం తో మృతి చెందింది..వారికి ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారు.. పిల్లలు భారం అనుకున్న అతను అర ఎకరం పొలం, డబ్బులు ఎదురిచ్చి మరి రెండో వివాహం చేసుకోవడానికి సిద్దపడ్డాడు..దాంతో అతని పదేళ్ల కూతురు కుమారి పోలీసులను ఆశ్రయించింది.. జరిగిన విషయాన్ని పోలీసులతో చెప్పింది.. ఉన్నది మొత్తం ఆమెకే ఇస్తే మేము ఎలా బ్రతకాలి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది..ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమ్మాయి తండ్రిని పిలిపించి మాట్లాడి పెళ్లిని రద్దు చేయించారు.. పిల్లల్ని చూసుకోకుంటేజైలుకు వెళ్తావని హెచ్చరించారు..ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. నిజంగా ఆ అమ్మాయి చేసిన పని గ్రేట్ కదా.. తండ్రికి బుద్ది చెప్పింది అంటూ కామెంట్లను అందుకుంటుంది..

Read more RELATED
Recommended to you

Latest news