కేవలం ఆవుల కోసం కేబినేట్ ఏర్పాటు చేస్తున్న సర్కార్…!

-

రాష్ట్రంలో ఆవు పశువుల సంరక్షణ మరియు ప్రమోషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘ఆవు క్యాబినెట్ ‘ ను ఏర్పాటు చేయనున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక ప్రకటన చేసారు. “పశుసంవర్ధక, అటవీ, పంచాయతీ మరియు గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, గృహ, రైతు సంక్షేమ శాఖను ‘ఆవు క్యాబినెట్’ లో చేరుస్తున్నామని ఆయన ప్రకటించారు.

‘ ఆవు క్యాబినెట్ ‘ మొదటి సమావేశం నవంబర్ 22 న మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది. గౌ అభయారణ్యం సలారియా అగర్ మాల్వా వద్ద గోపాష్టమి ఏర్పాటు చేస్తామని అన్నారు. అయితే, ఆవు కేబినేట్ అధికారాలు మరియు బాధ్యతల గురించి మరిన్ని వివరాలు ఇంకా మీడియాకు విడుదల కాలేదు. ఇక ‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్రం ప్రయత్నిస్తోందని మధ్యప్రదేశ్ ఎంపీ హోంమంత్రి నరోత్తం మిశ్రా ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news