వినాయక నిమజ్జనం : తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

-

తెలంగాణ సర్కార్‌ పై మరోసారి హై కోర్టు సీరియస్‌ అయింది. వినాయక నిమజ్జనం ఆంక్షలపై ఉత్తర్వులు రిజర్వ్ చేసిన హైకోర్టు… నిమజ్జనం సమస్యలపై తెలంగాణ ప్రభుత్వానికి శ్రద్ధ లేనట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. విచారణకు పది నిమిషాల ముందు నివేదిక ఇస్తే ఎలా అని జీహెచ్ఎంసీ పై అసహనం వ్యక్తం చేసింది. హైదరాబాద్ సీపీకి నివేదిక ఇచ్చే తీరికే లేదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

పీసీబీ మార్గదర్శకాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించిన హైకోర్టు.. జనం గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పడం లేదని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీలో 48 చెరువులు, కొలనుల్లోనూ నిమజ్జనం ఏర్పాట్లు చేశామన్న ప్రభుత్వం.. మట్టి గణపతులను ప్రోత్సహిస్తున్నామని.. లక్ష విగ్రహాలు ఉచితంగా ఇస్తున్నామని పేర్కొంది. సలహాలు కాదు.. చర్యలు, స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని హై కోర్టు హెచ్చరికలు జారీ చేసింది. నిమజ్జనం ఆంక్షలు, నియంత్రణలపై తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది. కాగా.. ఈ నెల 10 నుంచి గణేష్‌ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news