పరశురాం చేస్తున్న ఆ పనికి ఫిదా అవుతున్న ఇండస్ట్రీ..!!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకులలో ఒకరు గా చలామణి అవుతున్న పరుశురాం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జోడిగా వచ్చిన గీత గోవిందం సినిమా తో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న ఈయన ఆ తర్వాత అన్నీ లక్కీ ఛాన్స్ లే రావడం గమనార్హం. పరశురాం ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ అలాగే పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయిఇందులో మహేష్ బాబు మాస్ లుక్ లో కూడా కనిపించబోతున్నాడు. కాబట్టి మరొకసారి ప్రేక్షకులకు మాస్ భోజనం పెట్టించబోతున్నాడు పరుశురామ్. ఈ సినిమా మే 12వ తేదీన విడుదల అవుతూ ఉండగా మరొక హీరోను వెతుక్కునే బాటలో పడ్డాడు. అంతేకాదు పరశురాం ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటూ ఉండడం చూసి ఇండస్ట్రీ మొత్తం ఫిదా అవుతుంది.Burning point in Mahesh Babu and Parasuram project?

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పరుశురాం ఈసారి కూడా స్టార్ హీరో ని లాక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సర్కారు వారి పాట సినిమా కంటే ముందు నాగచైతన్యతో సినిమా చేస్తున్నాడు అనే కథలు కూడా వినిపించాయి.. అంతేకాదు కథ కూడా సిద్ధం అయింది షూటింగ్ మొదలు పెట్టడమే తరువాయి అని అనుకున్నారు.. కానీ మహేష్ బాబు తో ప్రాజెక్టు రావడంతో స్టార్ హీరో కాబట్టి మహేష్ బాబు ను పక్కకు నెట్టడం అసంభవం. అందుకే నాగచైతన్య తో తీయాల్సిన సినిమాను పక్కకు పెట్టి మహేష్ బాబుతో సినిమా పూర్తి చేశాడు.Is Akkineni Naga Chaitanya getting married again after divorce from Samantha? | Telugu Movie News - Times of India

అయితే నాగచైతన్య తో తీయాల్సిన కథ పక్కకు నెట్టేయడం తో మళ్లీ నాగచైతన్య పరశురామ్ తో సినిమా చేయడు అనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పరుశురాం తన నెక్ట్స్ ప్రాజెక్టు నాగచైతన్యతో అని స్పష్టం చేశాడు అంతేకాదు నాగచైతన్య కోసం మరో విభిన్నమైన కథను సిద్ధం చేసుకున్నాను అని త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుంది అని తన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చాడు పరుశురాం. ఇక కమిట్ మెంట్ కు రుణపడి పరశురాం వెనక్కి వచ్చి మళ్లీ నాగచైతన్యతో సినిమా తీస్తానని చెప్పడంతో ఇండస్ట్రీ వారు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు అంతే కాదు పరశురామ్ కమిట్మెంటు కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news