BREAKING : కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తి

-

కైకాల సత్యనారాయణ నిన్న తెల్లవారుజామున 4 గంటల సమయంలో అనారోగ్య సమస్యతో బాధపడుతూ హైదరాబాదులోని అపోలో హాస్పిటల్స్ లో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే ఈ దిగ్గజ నటుడిని కడసారి చూడడానికి సినీ రాజకీయ లోకం తరలివచ్చింది.

నవరస నటన సార్వభౌముడు కైకాల సత్యనారాయణ పార్తివదేహానికి ఆంధ్రప్రదేశ్ సీఎంతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు ప్రముఖులందరూ కూడా నివాళులు అర్పించారు. అయితే, కాసేపటి క్రితమే సార్వభౌముడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. కైకాల సత్యనారాయణ పెద్ద కుమారుడు లక్ష్మీ నారాయణ అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించారు. కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు.. అధికారికంగా జరిపించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news