ఆత్మకూరు ఉప ఎన్నికల్లో గౌతమ్‌రెడ్డి వారసుడి ఎంపిక : మేకపాటి

-

నెల్లూరు జిల్లా : ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి వారసుడిగా విక్రమ్ రెడ్డి ని ఎంపిక చేశామని.. మాజీ ఎం.పి.మేకపాటి రాజమోహన్ రెడ్డి వెల్లడించారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ తో కూడా ఈ విషయాన్ని చర్చించామన్నారు మాజీ ఎం.పి.మేకపాటి రాజమోహన్ రెడ్డి.

మంత్రి వర్గంలో స్థానం పై ఎలాంటి చర్చ జరగలేదని… నాకు ఎలాంటి పదవుల పై ఆశ లేదని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో సీనియర్ నేతకే మంత్రి పదవి ఇచ్చారన్నారు మాజీ ఎం.పి.మేకపాటి రాజమోహన్ రెడ్డి. మేకపాటి గౌతమ్ రెడ్డి వారసుడిగా విక్రమ్ రెడ్డి అయితే.. సరైన అభ్యర్థి అని మాజీ ఎం.పి.మేకపాటి రాజమోహన్ రెడ్డి వెల్లడించారు. మేకపాటి గౌతమ్‌ రెడ్డి తరహాలోనే… ఆత్మకూరు నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. కాగా… మేకపాటి గౌతమ్‌ రెడ్డి గత రెండు నెలల కిందట.. హర్ట్‌ ఎటాక్‌ తో మరనించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news