మంత్రిగా నా సత్తా ఏంటో చూపిస్తా: ఆర్కే రోజా

-

ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యే రోజా…మంత్రి అయ్యాక మొదటి సారి నగరి నియోజకవర్గంలో సోమవారం పర్యటించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “మంత్రిగా తన సత్తా ఏమిటో చూపిస్తానని”.. ఇప్పటివరకు ఒక లెక్క..ఇక నుంచి మరో లెక్క అని తెలిపింది.తనకు కేటాయించిన పర్యాటక శాఖ ద్వారా రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూర్చడం పై దృష్టి సారిస్తానని అన్నారు.ఇక తనకు సీటు రాదని, రోజా పని అయిపోయిందని ప్రచారం జరిగిందని, అలా ఎగతాళి చేసిన వారి నోళ్లు మూతపడేలా ఇక్కడి ప్రజలు తనను రెండు సార్లు గెలిపించారని అన్నారు రోజా.

తల్లిదండ్రులు తనకు జన్మనిచ్చినిచ్చారని, నగరి ప్రజలు తనకు రాజకీయ జన్మనిచ్చారు అని రోజా అన్నారు.2024 లోనూ మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారని రోజా ధీమా వ్యక్తం చేశారు.తన కంఠంలో ప్రాణమున్నంత వరకు నగరి ప్రజలకు సేవ చేస్తానని, చివరి రక్తపు బొట్టు వరకు జగనన్న కోసం పనిచేస్తానని మంత్రి రోజా చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news