టీలో విషం కలిపి పిల్లలను చంపిన తల్లి.. ఎందుకంటే?

-

భార్యాభర్తల మధ్య గొడవ వల్ల కుటుంబాలే నాశనం అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అత్తింట్లో భర్తతో గొడవ పడిన సునీత యాదవ్ తన నలుగురు పిల్లల్ని తీసుకుని దంధానిలోని తన పుట్టింటికి వచ్చింది. రెండు రోజుల క్రితం భర్త సునీతకు ఫోన్ చేసి మళ్లీ గొడవ పడ్డాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సునీత తన ముగ్గురు పిల్లలకి టీ విషం కలిపి తాగించింది. హిమాన్షు యాదవ్ (10), పీయూష్ యాదవ్ (8), సుప్రియ (5) మరణించినట్లు పోలీసులు తెలిపారు.

తల్లి-పిల్లలు-మృతి
తల్లి-పిల్లలు-మృతి

అయితే నాలుగో కుమారుడు బయట ఆడుకుంటుండటంతో అతడికి విషం కలిపిన టీ ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఇలాంటి ఘటనే ఆగస్టు 12న చెన్నైలో చోటు చేసుకుంది. ఇంట్లో అల్లరి చేస్తోందని ఓ తల్లి తన కూతురిని కర్రతో కొట్టి చంపింది.

Read more RELATED
Recommended to you

Latest news