జిహెచ్ఎంసి ఎన్నికలు.. ప్రజలు అప్పుడు అలా చెప్పి.. ఇప్పుడు ఇలా చేశారు..!

-

తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం అంతకుముందు లాగానే టిఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రస్తుత ఫలితాలు ఆశ్చర్య పరుస్తున్నాయి. ఎందుకంటే మొన్నటికి మొన్న హైదరాబాద్ నగరం మొత్తం వరదల్లో చిక్కుకు పోయింది.

అదేసమయంలో ప్రజలందరూ తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని నష్టపరిహారం కూడా ఇవ్వలేదు అంటూ ఆవేదన చెందారు. ఇక ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన టీఆర్ఎస్ నేతలను నిలదీశారు ప్రజలు. దీంతో ప్రజలు టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ప్రస్తుతం ప్రజలు టిఆర్ఎస్ కే ఓటు వేయడంతో భారీ మెజారిటీతో కొనసాగుతుంది అధికార టీఆర్ఎస్ పార్టీ.

Read more RELATED
Recommended to you

Latest news