ఏమి దొంగరా నాయనా.. చిన్న సందేశంతో షాక్ ఇచ్చాడు..

-

ఈ మధ్య కొన్ని చొరీలు పోలీసులకు దిమ్మ తిరిగేలా చేస్తున్నాయి..దొంగలు ఎలా చేస్తున్నారు అనే విషయం పై ఖాకీలు జుట్లు పీక్కుంటున్నారు.ఇంకొన్ని చొరీలు మాత్రం ఈజిగా సాల్వ్ అవుతున్నాయి. ఇక కొన్ని చొరీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సంవత్సరాలు గడిచినా కూడా సాగుతూనే ఉంటాయి. మొన్నీమధ్య పబ్లిక్ గా దొంగతనం చేసిన కూడా ఎవరూ పట్టించుకోలేదు.. ఇప్పుడు మరో వింత చొరీ జరిగింది.. అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..అసలు ఆ చొరీ అసలు గుట్టు ఏంటో ఇప్పుడు ఒకసారి చుద్దాము..

ఈ దొంగతనం గోవాలో జరిగింది.ఓ ఇంట్లోకి చొరబడిన దొంగ.. నగలు, నగదును చోరీ చేశాడు. చివరగా టీవీపై ఓ సందేశం రాసి వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చిన యజమాని.. చోరీ జరిగిన విషయాన్ని తెలుసుకుని షాక్ అయ్యాడు. చివరగా టీవీపై సందేశాన్ని చూసి అవాక్కయ్యాడు.. విషయాన్నికొస్తే..దక్షిణ గోవాలోని మార్గోవ్‌లో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఆసిబ్ జెక్ అనే వ్యక్తి ఇటీవల కుటుంబంతో సహా బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి మే 24న ఇంటికి వచ్చాడు.

తాళం తీసి ఇంట్లోకి వెళ్లగానే అక్కడ వస్తువులు అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయి..చిందరవందరగా పడి ఉన్నాయి.ఆ దృశ్యాన్ని చూసిన యజమాని షాక్ అయ్యాడు.ఇంట్లో దొంగతనం జరిగిందని తెలుసుకొని బీరువాలో వెతికాడు..రూ.20లక్షల విలువైన బంగారం, వెండి నగలు, రూ.1.5లక్షల నగదు కనిపించలేదు.చోరీ చేసిన దొంగ వెళ్తూ వెళ్తూ టీవీపై ‘ఐ లవ్ వ్యూ’ అని రాసి వెళ్లాడు. అప్పటికే కోపంతో ఉన్న ఆసిబ్‌.. టీవీపై అక్షరాలు చూసి అవాక్కయ్యాడు. తాళం వేసి ఉన్నా దొంగలు లోపలికి ఎలా వచ్చారో వారికి అర్థం కాలేదు. చివరగా బాత్‌రూం కిటికీ నుంచి వచ్చినట్లు గుర్తించారు..ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు..దొంగలను పట్టుకోవడంలో నిమగ్నమైయ్యరు.

Read more RELATED
Recommended to you

Latest news