దేశమంతా భారత రాజ్యాంగం.. ఏపీలో మాత్రం భారతి రాజ్యాంగం – ఆదినారాయణ రెడ్డి

-

దేశమంతా భారత రాజ్యాంగం నడుస్తుంటే.. ఏపీలో మాత్రం భారతి రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి.జమ్మలమడుగులో నిర్వహించిన బిజెపి యువ సంఘర్షణ స్కూటర్ ర్యాలీలో ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ..2024 ఎన్నికల్లో జమ్మలమడుగు బరిలో ఉంటానని తేల్చి చెప్పారు. రాష్ట్రానికి జగన్ దరిద్రం పోవాలని అన్నారు. నా రాజకీయ గురువు వైయస్ వివేకానంద రెడ్డిని చంపింది ఎవరో అందరికీ తెలుసని అన్నారు ఆదినారాయణ రెడ్డి.

వివేకా హత్య కేసుతో తనకు ఏమాత్రం సంబంధం లేకున్నా తనని ఇరికించే ప్రయత్నం చేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని 15 స్థానాలకే పరిమితం చేస్తామని అన్నారు. దేశమంతా భారత రాజ్యాంగం నడుస్తుంటే ఏపీలో మాత్రం భారతి రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తే తాను ప్రత్యర్థిగా బరిలోకి దిగుతానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news