భర్తకు కరెంట్ షాక్ పెట్టి చంపిన భార్య

-

ఇటీవల కాలంలో అక్రమ సంబంధాలు పచ్చటి కాపురాలలో చిచ్చు పెడుతున్నాయి. కట్టుకున్న బంధానికి కాస్తైనా విలువ ఇవ్వని మనుషులు క్షణికావేశంలో ఏకంగా పరాయి వ్యక్తుల మోజులో పడిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా అక్రమ సంబంధాల కారణంగా కట్టుకున్న భర్త కంటే ప్రియుడే ముఖ్యమని భావించి చివరికి కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చిన ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.

 

ఇలా ఇటీవల కాలంలో అక్రమ సంబంధాలు నేపథ్యంలో పోతున్న ప్రాణాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని మధుర జిల్లా సేల్ ఖేడా గ్రామంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ప్రియుడుతో ఎఫైర్ పెట్టుకున్న ఓ మహిళ తన భర్తను కరెంటు షాక్ పెట్టి చంపేసింది. మాన్వేంద్రా అనే యువకుడు పెళ్లయిన కొన్నాళ్లకే కరెంట్ షాక్ తో మరణించాడు. అతను కరెంటు షాక్ తోనే మరణించాడని భార్య అందరిని నమ్మించింది.

కానీ ఇటీవల ఆ మహిళ భర్త కుటుంబ సభ్యులు ఆమె ఫోన్ ని చెక్ చేయగా షాకింగ్ న్యూస్ బయటపడింది. ” నువ్వు చెప్పినట్లే కరెంట్ షాక్ పెట్టి భర్తను చంపేశా” అని ప్రియుడి తో మానేంద్ర భార్య మాట్లాడిన కాల్ రికార్డింగ్ బయటపడింది. దీంతో మాన్వేంద్ర కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితురాలితోపాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news