నడిరోడ్డుపై యువకుడిని చితకబాదిన యువతి..ఫోటోలు వైరల్

-

దేశంలో ఎన్ని కటిన చట్టాలు తెచ్చినా..ఎంత కఠినంగా శిక్షలు విధించినా స్త్రీలపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట పడడం లేదు.దేశంలో ఎక్కడో ఓ చోట చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అత్యాచారాలు, లైంగిక వేధింపులు వంటి వార్తలు వింటూనే ఉన్నాం.ఆంధ్రప్రదేశ్ లో ఆకతాయిల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.తనను వేధిస్తున్నాడంటూ ఓ ఆకతాయికి యువతి గట్టిగా బుద్ధి చెప్పింది.ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తున్న ఓ యువతి రాత్రిపూట తన బైక్ పై ఇంటికి వెళుతుండగా ఓ పోకిరి అడ్డగించి వేధింపులకు గురి చేశాడు.

కానీ ఆ అమ్మాయి అందరిలా చూస్తూూ ఊరుకోలేదు, భయపడలేదు, కాళికా అవతారం ఎత్తి నడి రోడ్డుపై కర్రతో చితకబాదింది.కాలితో తన్నింది.ఆడవాళ్లు ఎలా కనిపిస్తున్నారు అంటూ..ఆ పోకిరి దుమ్ము దులిపింది.దండం పెడతా వదలమని ఆ పోకిరి అమ్మాయిని వేడుకున్నాడు.అయినా విడిచిపెట్టకుండా అతడికి గట్టిగానే సమాధానం చెప్పింది.ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news