ఏకంగా ఎమ్మెల్యే ఇంట్లో చోరీ..

-

తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలు సంచలనంగా మారయి. ఏకంగా ఏపీలో ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో దొంగలు పడడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే జోగి రమేష్ ఇంట్లో దొంగతనం జరగగా ఏకంగా లక్షల రూపాయల మేర దుండగలు ఎత్తుకెళ్లినట్టు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఇంట్లో చోరీ జరిగింది.

సుమారు 2లక్షల మేర నగదును ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు పోలీసులు వెల్లడించారు. అర్థరాత్రి 12 గంటల సమయంలో దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లోనే దొంగతనం చేయడం సంచలనంగా మారింది. 

Read more RELATED
Recommended to you

Latest news