ఫార్ములా–ఈ కి సంబంధించిన లావాదేవీలు అధికారికంగా బ్యాంకు అకౌంట్ల ద్వారా జరిగినప్పుడు కేటీఆర్ వ్యక్తిగత ఫోన్, ల్యాప్టాప్ ఇవ్వాల్సిన అవసరం లేదని కేటీఆర్ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. కేటీఆర్ ఫోన్, ల్యాప్టాప్ ఇవ్వాలని ఏసీబీ చేసిన డిమాండ్ కు జవాబు ఇచ్చారు కేటీఆర్ తరపు న్యాయవాదులు.

వ్యక్తిగతంగా వాడే ఫోన్లు ఎలాంటి కోర్టు తీర్పు లేకుండా, వాటితో కేసుకు ఎలాంటి సంబంధం లేనపుడు అవి అడిగే హక్కు విచారణ సంస్థలకు లేదని పేర్కొన్న కేటీఆర్ న్యాయవాదులు…. ఫార్ములా–ఈ అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో జరిగిందని, కేటీఆర్ మంత్రి పాత్ర పోషించారని, వ్యక్తిగత సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఆర్టికల్ 21 ప్రకారం కోర్టు తీర్పు లేకుండా పర్సనల్ ఫోన్లు అడగడం వ్యక్తిగత హక్కులకు విఘాతం కలిగించడం అవుతుందని .. ఫార్ములా–ఈ కేసులో సమాచారం అంతా ప్రభుత్వం వద్ద ఉన్నప్పుడు వ్యక్తిగత వివరాలు అడగడం రాజకీయ కుట్రలో భాగమని వెల్లడించారు న్యాయవాదులు.