ప్రతిపక్షాలను అంతం చేసే కుట్ర జరుగుతుంది – కేజ్రీవాల్

-

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి పేరును ఉద్దేశించి 2019 ఎన్నికల ప్రచారం వేల కర్ణాటకలోని కోలార్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది గుజరాత్ సూరత్ లోని న్యాయస్థానం. ఐపీసీ సెక్షన్ 504 ప్రకారం ఉద్దేశపూర్వకంగా అవమానించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హెచ్ హెచ్ వర్మ స్పష్టం చేశారు.

ఇందుకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. “ప్రతిపక్ష నేతలను, పార్టీలను అంతం చేసే కుట్ర జరుగుతుంది. కాంగ్రెస్తో మాకు విభేదాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో రాహుల్ గాంధీని ఇలా ఇరికించడం సరైనది కాదు. న్యాయస్థానాన్ని గౌరవిస్తా.. కానీ తీర్పుతో ఏకీభవించను’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news