జూన్ 1 నుంచి పెరగనున్న బ్యాంక్ చార్జీలు ఇవే..!

-

బ్యాంక్ ఖాతాదారులకు హెచ్చరిక..జూన్ 1, 2022 నుంచి కొత్త చార్జీలు అమలు కానున్నాయని తెలుస్తుంది.ప్రభుత్వ బ్యాంకుల నుంచి అన్ని ఫైనాన్స్ సంస్థలు తమ సర్వీసులపై ఛార్జీలను పెంచనున్నాయి. ఈ నెల మొదటి వారం నుంచి వినియోగదారుల పై మరో భారం పడనుంది..ముఖ్యంగా ప్రభుత్వ బ్యాంక్ అయిన ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీరేట్ల నుంచి థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ ప్రీమియం లోన్ల వరకు అన్నింటిల్లో వినియోగదారులపై భారం పడనుంది. ఏయే బ్యాంకుల్లో ఏయే ఫైనాన్స్ సంస్థల్లో ఎలాంటి ఛార్జీలు పెరుగుతున్నాయో చుద్దాము..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..హోమ్ లోన్ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు 40 బేసిస్ పాయింట్లు పెంచేసింది. గృహ రుణాలపై వడ్డీ రేటు 7.05 శాతానికి పెరగనుంది. రేపో లింక్డ్‌ లెండింగ్ రేటు కూడా 6.65 శాతానికి పెరిగిపోనుంది. ప్రస్తుత EBLR 6.65 శాతంగా నమోదైంది. RLLR 6.25 శాతంగా ఉంది..జూన్ 1, 2022 నుంచి పెరిగిన వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నాయి. శాలరీ అకౌంట్ సర్వీసు రుసుములతో పాటు యాక్సిస్ బ్యాంక్ సేవింగ్స్ ఛార్జీలను పెంచనుంది. సెమీ అర్బన్/గ్రామీణ ప్రాంతాలలోని అకౌంట్‌దారులు నెలవారీ సగటు బ్యాలెన్స్‌ రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచేశాయి.

జూన్ 1 నుంచి పెంచిన ఈ కొత్త చార్జీలు అమలవుతున్నాయి. వాహనాల థర్డ్‌ పార్టీ మోటార్ బీమా ప్రీమియం కూడా భారీగా పెరగనుంది. ఈ మేరకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని వెల్లడించింది. టూవీలర్ వాహనాల్లో ఇంజిన్‌ సామర్థ్యం 75cc కన్నా తక్కువ ఉంటే ఆ వాహనాలపై బీమా ప్రీమియం రూ.538గా ఉండనుంది. 75cc పైన 150cc లోపు వాహనాలపై రూ.714గా ఉండనుందని తెలుస్తుంది.150cc నుంచి 350cc మించని వాహనాలపై రూ.1366గా, 350cc కన్నా ఎక్కువ సామర్థ్యం ఉండే బైక్‌లకు ప్రీమియం రూ.2,804గానూ ఉండనుంది. 1000cc ఇంజిన్‌ సామర్థ్యంతో ప్రైవేటు కార్ల ప్రీమియం రూ.2094 వరకు పెరగనుంది.

1000cc పైనా 1500cc కలిగిన ఇంజిన్‌ సామర్థ్యంతో నడిచే ప్రైవేటు కార్ల బీమా ప్రీమియం ధర రూ.3,416కు పెరగనుంది. అలాగే 1500cc కన్నా ఎక్కువ ఇంజిన్‌ సామర్థ్యం కలిగిన కార్ల ప్రీమియం రూ.7,890 వరకు చార్జీలు పెరగనున్నాయి. అలాగే భారతీయ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ సర్వీస్ ఛార్జీలను కూడా భారీగా పెంచేసింది. లావాదేవీలపై ఈ ఛార్జీలను వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది. నగదు విత్‌డ్రా, డిపాజిట్‌, మినిస్టేట్ మెంట్ ఛార్జీలు వర్తిస్తాయి. ప్రతినెలా మొదటి 3 వరకు ఉచితంగానే పొందవచ్చు. క్యాష్ డిపాజిట్‌, విత్‌డ్రాలకు రూ.20+GST, మినీ స్టేట్‌మెంట్ రూ.5+GST వర్తిస్తుంది..మొత్తానికి ఈ నెల నుంచి సామాన్యుల పై బాదుడే.. బాదుడు..

 

Read more RELATED
Recommended to you

Latest news