పెన్షన్ దారులకు సీఎం కేసీఆర్ శుభ వార్త

-

పెన్షన్ దారులకు  కేసీఆర్ సర్కార్ శుభ వార్త చెప్పింది. త్వరలోనే కొత్త లబ్ధి దారులకు పెన్షన్ ఇస్తామని ప్రకటించారు మంత్రి హరీష్ రావు. గజ్వేల్ మహతి ఆడిటోరియంలో వ్యవసాయ శాఖ అధికారులకు నిర్వహించిన వానాకాలం సాగుకు సన్నాహక సమావేశంలో.. మంత్రి హరీష్ రావు మాట్లాడారు. వచ్చే వానాకాలం ఏ పంటలు వేస్తే రైతులకు మేలు జరుగుతదో ఆలోచించాలి… గతంలో ఎండాకాలం వచ్చింది అంటే అంబలి కేంద్రాలు, రైతుల ఆత్మహత్యలు, ధర్నాలు ఆందోళనలు ఉండేవన్నారు.

ఐదేళ్లలో మార్పు తెచ్చాము..ఇప్పుడు ఏ మూలకు వెళ్లిన ధాన్యపు సిరులు కనిపిస్తున్నాయని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతుల ఆత్మహత్యలు, కరెంట్ కోతలు, కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయని ఫైర్ అయ్యారు.మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి అని… తెలంగాణలో 24 గంటల కరెంట్, సాగు నీళ్లు, రైతు బంధు, రైతు బీమా ఇలా అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతు బీమా రద్దు చేయాలని అంటున్నారు.. రద్దు చేద్దామా.!?అని ప్రశ్నించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news