MAA ELECTIONS : “మా” ఎన్నికల్లో ఓటు వేయని సెలబ్రిటీలు వీళ్లే

-

మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ చాలా ఉత్కంఠభరితంగా సాగిన సంగతి తెలిసిందే. ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైన మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు… తర్వాత తీవ్ర వివాదానికి తెర లేపాయి. పోలీసుల జోక్యంతో… మధ్యాహ్నం మూడు గంటల సమయానికి మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. అయితే… ఇవాళ జరిగిన ఈ ఎన్నిక లో ఏకంగా ఆరు వందల అరవై ఐదు మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంతటి భారీ స్థాయి పోలింగు నమోదు కావడం చరిత్రలో ఇదే తొలిసారి. ఈసారి ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 83 శాతం పోలింగ్ నమోదైంది.

maa elections

గత మా ఎన్నికల్లో కేవలం 474 ఓట్లు పోల్ కాగా ఈసారి 665 ఓట్లు పోలయ్యాయి. అయితే ఈ సారి జరిగిన.. మా అధ్యక్ష ఎన్నికల్లో… చాలా మంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు.

దగ్గుబాటి వెంకటేష్, రానా, జూనియర్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ , మహేష్ బాబు, మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్, అల్లు శిరీష్ అలాగే మాస్ మహారాజ్ రవితేజ, నాగ చైతన్య, నితిన్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. అలాగే ఈ ఎన్నికల్లో హీరోయిన్ కూడా తమ ఓటు హక్కును వినియోగించు కోలేకపోయారు. రకుల్ ప్రీతిసింగ్, సమంత, అనుష్క మరియు హన్సిక తమ ఓటు హక్కును ఈసారి ఎన్నికల్లో వినియోగించుకోలేదు.

Read more RELATED
Recommended to you

Latest news