పవిత్ర లోకేష్ గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇవే..!

-

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు పవిత్ర.. సినిమాలలో కంటే వ్యక్తిగత వ్యవహారాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా పలు భాషలలో నటించి మెప్పించిన ఈమె ఇప్పుడు మూడో పెళ్లితో టాలీవుడ్ ఆడియన్స్ లో అటెన్షన్ రేకెత్తించింది. ఏంటి మూడు పెళ్లిళ్ల అని ఆశ్చర్యపోకండి ఇక ఈమె గురించి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్య పోవాల్సిందే.. పవిత్ర లోకేష్ కర్ణాటకలోని మైసూర్ లో జన్మించారు. ఈమె తండ్రి లోకేష్ ఒక నటుడు.. తల్లి ఉపాధ్యాయురాలు పవిత్రకు ఆది లోకేష్ అనే తమ్ముడు కూడా ఉన్నారు.

చదువులో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే పవిత్ర లోకేష్ 9వ తరగతి చదువుతున్నప్పుడే తండ్రి మరణించాడు. అయినా కూడా చదువులో మెరుగ్గానే రాణించింది. పదవ తరగతిలో 80% ఉత్తీర్ణత సాధించి విద్య పట్ల తనకున్న మక్కువ చాటుకుంది. బాగా చదువుకునే ఈమె సివిల్ సర్వెంట్ కావాలని భావించింది. అయితే తండ్రి మరణంతో తల్లికి సహాయం చేయాలని నిర్ణయించుకొని కుటుంబ బాధ్యతలు మోయడానికి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. ఇకపోతే మైసూర్ లోని మహాజన ఫస్ట్ గ్రేడ్ కాలేజీ నుండి కామర్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి సివిల్ సర్వీసెస్ పరీక్షకి కూడా హాజరయ్యింది.

మొదటి ప్రయత్నంలో విఫలమైన ఈమె నటన జీవితాన్ని ఎంచుకుంది. ప్రముఖ నటుడు అంబరీష్ సలహా మేరకు 1994లో కన్నడ నటిగా కెరియర్ మొదలు పెట్టింది. ఇక తెలుగులో రేసుగుర్రం , టెంపర్ మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి సినిమాలలో మంచి క్యారెక్టర్స్ చేసి నటిగా పేరు సంపాదించుకుంది. ఇకపోతే ఇప్పుడు మాత్రం నరేష్ తో లివింగ్ రిలేషన్ అంటూ వార్తల్లో నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news