తెలంగాణలో ముగ్గురు కొత్త మంత్రులు వీళ్లే.. డిప్యూటీ స్పీకర్ ఎవరంటే ?

-

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇవాళ మధ్యాహ్నం రాజ్ భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనుంది. ఈ తరుణంలోనే నూతన మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరికి అభినందనలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

These are the three new ministers in Telangana
These are the three new ministers in Telangana

అటు శాసనసభ ఉపసభాపతి బాధ్యతలు స్వీకరించబోతున్న రామచంద్రు నాయక్ కి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ తరుణంలోనే కొత్త మంత్రులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మంత్రులుగా వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు శుభాకాంక్షలు చెప్పారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కాబోతున్న రామచంద్ర నాయక్ కు అభినందనలు పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి కాంగ్రెస్ సామాజిక న్యాయం అమలు చేస్తోందన్నారు మహేష్ కుమార్ గౌడ్.

Read more RELATED
Recommended to you

Latest news