2022 లో బ్యాచిలర్ లైఫ్ కు బైబై చెప్పిన టాలీవుడ్ హీరోయిన్స్ వీళ్ళే..!!

-

2022 ముగియడానికి కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈ ఏడాది బ్యాచిలర్ లైఫ్ నుంచి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు. అలా ఈ ఏడాది వివాహం చేసుకొని ఒకటైన సెలబ్రిటీల గురించి మనం తెలుసుకుందాం.

1). ఆది పినిశెట్టి-నిక్కీ గర్లానీ:

టాలీవుడ్ లో ఆది పినిశెట్టి ,హీరోయిన్ నిక్కీ గర్లానీ ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ శమంతకమణి అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమించుకున్నారు.

2). పూర్ణ:

హాట్ హీరోయిన్ గా పేరు పొందిన ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది కొత్త జీవితంలో అడుగుపెట్టి అందరికీ సడన్ షాక్ ఇచ్చింది. అక్టోబర్ ఐదు న దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త ఆసిఫ్ ఆలీని వివాహం చేసుకుంది.

3). సింగర్ రేవత్:

సింగర్ రేవంత్ కూడా ఈ ఏడాది వివాహం చేసుకున్నారు అంతేకాకుండా బిగ్ బాస్ విజేతగా కూడా నిలిచారు. వీరికి ఒక పాప కూడా జన్మించింది.

4). మంజిమ మోహన్:

నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రంతో ఈమె తెలుగు తెరకు పరిచయమైంది మంజిమ.. ఈ ఏడాది తమిళ హీరో కార్తీక్ ను వివాహం చేసుకుంది.

5). నయనతార- విగ్నేష్:
కోలీవుడ్ , టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న నయనతార.. డైరెక్టర్ విగ్నేష్ ను జూన్ 9వ తేదీన వివాహం చేసుకుంది. వీరికి ఇప్పుడు ఇద్దరూ కవల పిల్లలు కూడా ఉన్నారు.

ఈ ఏడాది తెలుగు పరిశ్రమలో పరిచయం ఉన్న నటులు వివాహం చేసుకోవడంతో వీరి అభిమానులు కూడా కాస్త ఆనందపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news