దేశంలో వేగంగా పెరుగుతున్న ఈ రెండు వేరియంట్లు..!

-

అందరూ కరోనా పని అయిపోయింది అని కూల్‌గా ఉన్నారు..కానీ అది ప్రపంచదేశాల్లో విలయతాండవం చేస్తుంది.. ఈరోజు అక్కడ కానీ ఒకరోజు ఇక్కడకు కూడా వచ్చేస్తుంది. ఎంతో టైమ్‌ పట్టదు.. చైనా, అమెరికా, జపాన్‌లలో పరిస్థితి మరింత దిగజారింది. ముఖ్యంగా రెండు రకాల వైరస్‌లో వేగంగా వ్యాపిస్తున్నాయి.. చైనాలో ఒమిక్రాన్‌ bf.7 వేరియంట్, అమెరికా, జపాన్‌లలో X-BB వేరియంట్ కేసులు ఘరంగా పెరుగుతున్నాయి. మూడు దేశాల్లోనూ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.

అమెరికాలో చూసుకుంటే.. ఒమిక్రాన్‌ xbb 1.5 వేరియంట్ అంటువ్యాధిగా మారింది. 40 నుంచి 45 శాతం మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. xbb 1.5 వేరియంట్ రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. ఈ వేరియంట్ కేసులని భారతదేశంలో కూడా గుర్తించినట్లు వైద్యులు తెలిపారు.. అయితే ప్రస్తుతం దేశంలో కొత్త కోవిడ్ కేసుల పెరుగుదల లేదు. వైరస్‌ నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో రెండు రకాలైన కరోనా కేసులు వస్తున్నాయి. INSACOG ప్రకారం X-BB 1.5 సబ్-వేరియంట్‌తో సోకిన వారి సంఖ్య భారతదేశంలో ఏడుకి చేరినట్లు సమాచారం.. ఇది కాకుండా bf.7 వేరియంట్‌ల కేసులు పెరుగుతున్నాయి. గతంలో పశ్చిమ బెంగాల్‌లో ఈ వేరియంట్‌ సోకిన ముగ్గురిని గుర్తించారు.

xbb 1.5 వేరియంట్ ఇంకా ఫాస్ట్..

bf.7 వేరియంట్ కంటే xbb 1.5 వేరియంట్ ఎక్కువగా విస్తరిస్తోంది. BF.7 వేరియంట్ కేసులు చైనాలో మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే X-BB 1.5 ప్రపంచవ్యాప్తంగా వ్యాపించేస్తుంది.. కొన్ని రోజుల్లోనే దాదాపు 30 దేశాలకు వ్యాపించిందంటే ఇది ఎంత పవర్‌ఫుల్‌లో మీరే చూడండి.. ఇది సింగపూర్‌లో ప్రారంభమైంది. ఇక్కడ 55 శాతం మంది ప్రజలలో ఈ వేరియంట్‌ను గుర్తించారు. ఇది బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులే ఈ వేరియంట్‌కు టార్గెట్‌..వాళ్లే బాధితులుగా అవుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

ఒమిక్రాన్‌కి సంబంధించి ఈ రెండు రకాలు కేసులు భారతదేశంలో ప్రస్తుతానికి తక్కువగా ఉన్నాయి. కానీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఈ సీజన్‌లో ఎలాగైనా ఫ్లూ, వైరస్ కేసులు పెరిగే ప్రమాదం ఉంది. మాస్క్‌లను తప్పకుండా ఉపయోగించాలి. బూస్టర్ డోస్ తీసుకోని వారు తప్పకుండా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news