నా బెడ్ రూమ్, బాత్రూంలోకి చొరబడి మాట్లాడుతున్నారు.. నరేష్

-

గత కొన్నాలుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం నరేష్ పవిత్ర లోకేష్. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం ఎంతో రచ్చ జరుగుతున్నప్పటికీ తమ మధ్య ఏమీ లేదంటూ చెప్పుకోస్తూనే ఉన్నారు వీరిద్దరూ. అయితే డిసెంబర్ 31న తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియో కాస్త వైరల్ గా మారడంతో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పెద్ద రచ్చ చేశారు. ఆ తర్వాత ఇదంతా సినిమా కోసం మాత్రమే చేసామంటూ క్లారిటీ ఇచ్చేశారు నరేష్. ఇప్పటికీ వీరిద్దరి రిలేషన్ కోసం ఎన్నో వార్తలు పుకార్లు నడుస్తున్నాయి అయితే తాజాగా వీటిపై ఫైర్ అయ్యారు నరేష్..

నటుడు నరేష్ గత కొన్నాళ్లుగా పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్నట్టు వస్తున్న వార్తలపై మండిపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడిన నరేష్.. “అసలు ఒక వ్యక్తి లేకుండా ఆ వ్యక్తి గురించి అతడి బెడ్‌రూంలో బాత్‌రూంలో దాక్కున్నట్టు మొత్తం వ్యక్తిగత వ్యవహారాల గురించి మాట్లాడుతున్నారు. ఇలా చేసి కొందరు డబ్బులు చేసుకుంటున్నారు మరికొందరు డబ్బులు తీసుకుంటున్నారు. వీళ్లలో మూడు రకాల మనుషులు ఉన్నారు. ఒకరు సామాజిక కార్యకర్త అనే పేరుతో మాట్లాడుతున్నారు. మరొకరు సినీ విమర్శకుడి పేరుతో మాట్లాడుతున్నారు. సినీ విమర్శకులు సినిమా గురించి మాట్లాడాలి. అయితే సినీ నటుల వ్యక్తిగత జీవితాలతో మీకు సంబంధం ఏంటి.. ఎవరి లైఫ్ వాళ్లది. ఇంకా సామాజిక కార్యకర్తలకు సామాజిక సమస్యలు చాలా ఉన్నాయి. తిండిలేకుండా చాలా మంది ఉన్నారు. దాని గురించి మాట్లాడాలి.. కానీ మా వ్యక్తిగత జీవితాల్లోకి ఎందుకు చొరబడుతున్నారు. కొందరు మ్యారేజ్ కౌన్సిలర్లు కూడా మా కోసం మాట్లాడుతున్నారు ఈ విషయాలపై ఎవరో ఒకరు ఫైట్ చేయాలి అందుకే నేను వచ్చాను..” అంటూ చెప్పుకొచ్చారు నరేష్.

 

అయితే ఇప్పటికే నరేష్ పవిత్ర లోకేష్ రిలేషన్ లో ఉన్నారు అంటూ చాలామంది ఫిక్స్ అయిపోయారు. ముఖ్యంగా వీరిద్దరూ ఎక్కడ కనిపించినా జంటగానే కనిపించడం, సూపర్ స్టార్ కృష్ణ గారు చనిపోయినప్పుడు సైతం నరేష్ పవిత్రను వెంటపెట్టుకొని కనిపించడం ఈ రూమర్లకు మరింత బలాన్ని చేకూర్చాయి. అలాగే ఓ హోటల్లో వీరిద్దరూ ఉంటుండగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి అక్కడికి వెళ్లి గొడవ కూడా చేశారు ఇంత జరిగినప్పటికీ తమ మధ్య ఏమీ లేదంటూ ఇప్పటికీ చెప్పుకొస్తున్నారు నరేష్.

Read more RELATED
Recommended to you

Latest news