షాకింగ్: చిరు, బాలయ్య వసూళ్లను కొల్లగొట్టిన దొంగలు.!

-

తెలుగు సినిమా లకు సంక్రాంతి పండుగ సీజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటేమామూలు సినిమాలు కూడా ఈ టైమ్ లో హిట్ టాక్ తెచ్చుకుంటాయి.  రీసెంట్ గా విడుదల అయిన బాలయ్య బాబు వీరాసింహ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా లు కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నాయి.

ఈ రెండు సినిమాలు ఒక దానితో మరొకటి పోటీ పడుతూ ఇప్పటికే 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి ఇంకా ముందుకు సాగుతూనే ఉన్నాయి. ఇక్కడే గుంటూరు జిల్లాలో ఒక థియేటర్ ఓనర్ కు దొంగలు ట్విస్ట్ ఇచ్చి మొత్తం దోచేశారు. థియేటర్ ఓనర్స్ కు  ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి మైండ్ బ్లాంక్ చేశారు.

ఇక వార్త సారాంశం లోకి వెళితే గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని శ్రీ లక్ష్మీ థియేటర్ లో దొంగలు పడి వాల్తేరు వీరయ్య వీర సింహారెడ్డి సినిమాల మూడు రోజుల కలెక్షన్లను దోచుకెళ్లారు. థియేటర్ ఓనర్ బ్యాంక్ సెలవులు ఉండటం వల్ల కలెక్షన్ డబ్బులు డిపాజిట్ చేయలేదు. దాన్ని దొంగలు గమనించి హీరోలు వసూళ్ళు కొల్లగొడితే దొంగలు డబ్భులు కొల్లగొట్టారు.చోరీ విషయంపై వెంటనే థియేటర్ నిర్వాహకులు పొన్నూరు పోలీసులకు సమాచారం అందించారు. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news