చేత కాని ఎస్ఈసీ నిర్వ‌హించింది ఎన్నిక‌లే కాదు- అచ్చెన్నాయుడు

-

రాష్ట్రం లో ఉన్న చేత కాని ఎన్నిక‌ల క‌మిష‌న్ , రాష్ట్ర ప్ర‌భుత్వం క‌లిసి నిర్వ‌హించిన ఈ ఎన్నిక‌లు ఎన్నిక‌లే కావ‌ని టీడీపీ సినియ‌ర్ నేత అచ్చెన్నాయుడు అన్నాడు. అలాగే ఎన్నిక‌ల కు స‌హ‌క‌రించిన కార్య‌కర్త ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపాడు. కార్య‌క‌ర్త ల‌ను చూస్తేంటే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌త‌నం ప్రారంభం అయిన‌ట్టు అనిపిస్తుంద‌ని అన్నాడు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌మ కార్య‌క‌ర్త ల‌పై ఎన్ని కేసులు పెట్టిన ఏ మాత్రం జంక కుండా పార్టీ కోసం క‌ష్ట ప‌డ్డార‌ని అన్నారు.

అందే విధంగా తెలుగు దేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు రావ‌డానికి క‌ష్ట ప‌డ్డ కార్య‌క‌ర్త ల కృషి ని అభినందిస్తున్నామ‌ని అన్నారు. ప్ర‌జ‌లు త‌మ పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని కాపాడుకుంటామ‌ని అన్నారు. అలాగే త‌ర్వాత వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపె ల‌క్ష్యం గా ప‌ని చేస్తామ‌ని అన్నారు. కుప్పం లో వైసీపీ ముందే గెలుస్తుంద‌ని తెలుస‌న‌ని అచ్చెన్నాయుడు అన్నారు. కుప్పంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికార దుర్వినియోగం చేసింద‌ని విమ‌ర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news