రాజ్ తరుణ్ పై వినిపిస్తున్న వార్తలపై క్లారిటీ ఇదే..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కెరియర్ మొదట్లో ఎన్నో సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. మొదట నటించిన ఉయ్యాల జంపాల సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు. అయితే ఈ మూడు సినిమాలకు నిర్మాతగా అనిల్ సుంకర్ వ్యవహరించారట. అయితే అందుకు రెమ్యూనరేషన్ బదులుగా రాజ్ తరుణ్ విల్లా తీసుకున్నారనే వార్తలు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి. కేవలం విల్లాకోసమే రాజ్ తరుణ్ ఆ మూడు సినిమాలు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ విషయం గురించి రాజ్ తరుణ్ క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది.. విల్లా కోసం నేను ఆ చిత్రాలలో నటించానానే జరిగిన ప్రచారంలో అసలు నిజం లేదని.. మొదట అనిల్ సుంకర బ్యానర్ లోనే తన నటించే సమయంలో తనకు విల్లా ఆఫర్ కూడా ఇవ్వలేదని రాజ్ తరుణ్ తెలిపారు. అయితే కొంతమేరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని వెల్లడించారు. కానీ ఒక సినిమాలో నటించే సమయంలో మరో రెండు సినిమాల్లో కూడా ఆఫర్లు రావడంతో డబ్బు తీసుకోకుండా విల్లా తీసుకుంటే మంచిదని కొంతమంది తనను సూచించారని అందుకోసమే నేను విల్లా తీసుకున్నానని తెలియజేశారు.

అందులోనే ప్రస్తుతం తను ఉంటున్నట్లుగా తెలియజేయడం జరిగింది.ఇక తను ఎంచుకొనే కథలు ఎంపిక విషయంలో నటుడు రాజా రవీంద్ర పాత్ర ఉంటుందని తెలియజేశారు. ఇద్దరం కలిసి కథలు వినే సమయంలో రాజా రవీంద్ర సైలెంట్ గానే ఉంటారని తెలియజేశారు. అయితే ఏదైనా కథలు నచ్చితే బెటర్ అని చెప్పడానికి రాజా రవీంద్ర సలహాలు ఇస్తూ ఉంటారని రాజ్ తరుణ్ తెలియజేశారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి

Read more RELATED
Recommended to you

Latest news