కేంద్రం పబ్ జీ ఆపాక జగన్ చేస్తుంది ఇదే…!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. వెంకటపాలెం సీడ్ యాక్సిస్ వద్ద గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను రాజధాని రైతులు, దళితులు, అమరావతి జేఏసీ, మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడారు.

చంద్రబాబు కట్టిన సచివాలయం, అసెంబ్లీ లో కూర్చుని రైతుల గుండెల మీద ప్రభుత్వం తంతుంది అని ఆయన మండిపడ్డారు. సీఎం జగన్ మాట తప్పారు… మడం తిప్పారని ఆయన ఆరోపించారు. కేంద్రం పబ్ జీ ఆట అపడంతో ఏపీ సీఎం ఏమి చేయాలో అర్థం కాక ఆ ఆట ప్రజలపై ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. అమరావతి అంగుళం కూడా కదలదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news