టాలీవుడ్‌ లో మరో విషాదం..నిర్మాత గోరంట్ల మృతి

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా కరోనా అలాగే ఇతర కారణాల వల్ల చాలామంది ప్రముఖ నటులు తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలోనే…తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర చోటు చేసుకుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్ (86) కన్నుమూశారు.

మాధవి పిక్చర్స్ బ్యానర్ పై దొరబాబు సుపుత్రుడు, కురుక్షేత్రం, ఆటగాడు, తదితర చిత్రాలను నిర్మించిన రాజేంద్రప్రసాద్.. నిన్న రాత్రి మరణించినట్లు సమాచారం అందుతోంది. డి. రామానాయుడుతో పలు చిత్రాలకు సహా నిర్మాత గా ఉన్నారు గోరంట్ల రాజేంద్రప్రసాద్. ఇక నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్ మృతి పట్లు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news