రంగారెడ్డి జిల్లాలో విషాదం.. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి

-

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని సోలిపూర్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. వీరి వయసు పదేళ్లలోపు ఉంటుందని స్థానికులు తెలిపారు.

షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన అక్షిత్ గౌడ్‌, ఫరీద్‌, ఫరీన్‌ ఈ ఉదయం ఆడుకోవడానికి బయటకు వెళ్లారు. ఓ చోట వెంచర్‌ కోసం వేసిన స్థలంలో నీరు నిలవగా.. అందులో చేపలు పట్టేందుకు దిగారు. ఈ క్రమంలో ఈత రాక మునిగిపోయి ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు.

చిన్నారుల కోసం వెతుకుతూ అక్కడికి వచ్చిన వారి తల్లిదండ్రులకు మృతదేహాలు తేలియాడుతూ కనిపించాయి. మృతిచెందిన చిన్నారుల వయసు పదేళ్లలోపే ఉంది. కుమారుల మృతితో వారి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. నీటి గుంత నుంచి మృతదేహాలను గ్రామస్థులు వెలికితీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news